NTR: రెడ్డిగూడెం మండలం కూనపరాజుపర్వ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవం కావడాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యేని కలిసినట్లు వారు వెల్లడించారు. నీటి సంఘం ప్రతినిధులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. సాగునీటిని సకాలంలో సరఫరా చేసి, రైతులకు సేవలను అందించాలని అన్నారు.