కడప: జమ్మలమడుగు పట్టణంలోని గాంధీ కూడలి వద్ద ఈరోజు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరణాల శివ నారాయణ ఆధ్వర్యంలో చేనేతల విద్యుత్ బిల్లులపై నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శివ నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేనేతలకు ఇచ్చిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు హామీని వెంటనే అమలు చేయాలని అన్నారు.