E.G: మొంథా తుఫాను కారణంగా వాయిదా పడిన గోదావరి హారతి కార్యక్రమాన్ని ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు బుధవారం తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో ఏటా కార్తీక మాసంలో ఈ హారతి నిర్వహిస్తారు. గత నెల 27న నిర్వహించ తలపెట్టిన కార్యక్రమం వాయిదా పడింది. ఈ కార్యక్రమం కోసం టీటీడీ నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహాలను తీసుకొస్తామన్నారు.