ప్రకాశం: దోర్నాల మండలంలోని పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ను ఇవాళ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించనున్నట్లు మంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఉదయం 8:30 గంటలకు వెలుగొండ ప్రాజెక్ట్ వద్దకు చేరుకొని అక్కడి పనులను పరిశీలించనున్నారు. అనంతరం ప్రాజెక్ట్ అధికారులు, కంపెనీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారని మంత్రి కార్యాలయం తెలిపింది.