కోనసీమ జిల్లాలో గ్యాస్ కొరత ఉండదని జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి స్పష్టం చేశారు. ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె అమలాపురం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక చర్యల మూలంగా గృహ వినియోగదారులకు యధావిధిగా సరఫరా కొనసాగుతుందని తెలిపారు.