E.G: APEPDCL రాజమండ్రి రూరల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దాట్ల శ్రీధర్ వర్మ శనివారం అర్ధరాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాజమండ్రిలోని ఆయన భౌతికకాయానికి ఆదివారం ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ తిలక్ కుమార్, మాజీ ఎస్ఈ సత్యనారాయణ రెడ్డి సహా పలువురు అధికారులు నివాళులర్పించారు.