SKLM: యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలి అని రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు ప్రత్యేక ఆహ్వానం మేరకు శనివారం ఎచ్చెర్లలో మంత్రి పర్యటించారు. ఈ మేరకు ఎచ్చెర్ల నియోజకవర్గంలో జరుగుతున్న మోదీ కప్ క్రికెట్ టోర్నమెంటును సందర్శించారు. బ్యాట్ పట్టి క్రికెట్ ఆడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.