SKLM: పాతపట్నంకి చెందిన డీఎస్సీ పరీక్షలో అర్హత సాధించిన 80 మంది అభ్యర్థులకు గురువారం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు నియామక పత్రాలను విజయవాడలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందనలు తెలుపుతూ, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు ప్రభుత్వం, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.