PLD: గురజాల పట్టణంలోని పాతపాటేశ్వరి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవ వేడుకలకు టీటీడీ పాలకమండలి సభ్యులు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావులు ఆదివారం రాత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమ్మవారి దయవల్ల పల్నాడులో పాడి పంటలు బాగుండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు వారిని శాలువాలతో సన్మానించారు.