GNTR: అమరావతి ప్రాంతంలోని తుళ్ళూరులో ఆదివారం సాయంత్రం ఎన్టీఆర్ విగ్రహాన్ని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. కాగా, ఈ కార్యక్రమానికి కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరైన నేపథ్యంలో జేబు దొంగలు కూడా ప్రత్యక్షమయ్యారు. సుమారు రూ.70వేల వరకు అపహరణకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు.