GNTR: గుంటూరు 41వ డివిజన్ స్వర్ణ భారతి నగర్ ఎస్టీ కాలనీ కమ్యూనిటీ హాల్లో మెప్మా ఆధ్వర్యంలో, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ సహకారంతో నిర్వహించిన “సఖీ–సురక్ష” మెడికల్ హెల్త్ స్క్రీనింగ్ క్యాంపును ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రారంభించారు. మహిళల ఆరోగ్య రక్షణకు ఈ కార్యక్రమం కీలకమని ఎమ్మెల్యే తెలిపారు.