KRNL: కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యను యువత ఆదర్శంగా తీసుకోవాలని సీపీఎం పట్టణ కార్యదర్శి రన్ దీర్ పేర్కొన్నారు. సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా సోమవారం ఆత్మకూరులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు.