KRNL: పత్తికొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సకాలంలో వర్షాలు కురిసి రైతుల పొలాలు కలకలాడుతూ.. వారి కుటుంబాలు సుఖశాంతులతో జీవించాలని స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రజలందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.