GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్యూ) 49వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని బుధవారం మీడియా కమిటీ ఆచార్య వి.వెంకటేశ్వర్లు తెలిపారు. విశ్వవిద్యాలయం డైక్మన్ ఆడిటోరియంలో జరిగే ఈ కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య గంగాధర్ రావు ముఖ్య అతిథిగా, ఆచార్య రత్న శిలామణి పాల్గొననున్నారు.