PLD: కారంపూడి మండలంలో శనివారం నిర్వహించిన నీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మండలంలోని అన్ని నీటి సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ధ్రువీకరించి వారికి నియామక పత్రాలు అందజేశారు. రామాపురం మేజర్కు అధ్యక్షుడిగా ఎన్నికైన పంగులూరి అంజయ్య, ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన పాతూరి నాగేశ్వరరావు రైతులకు కృతజ్ఞతలు తెలిపారు.