కృష్ణ: నూజివీడు ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో అడ్మిషన్ల కోసం అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రధాన అధికారి దేవరకొండ భూషణం తెలిపారు. నూజివీడులో ఆయన మంగళవారం మాట్లాడుతూ.. 8వ తరగతి నుండి టెన్త్ క్లాస్ వరకు అర్హత కలిగిన వారు ఈ నెల 29 నుండి మే 24వ తేదీలోపు https//itiadmissions.ap.gov.in/iti/login.do ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేయవచ్చన్నారు.