MBNR: పాల్వంచ KTPSలో రాష్ట్ర జేఏసీ పిలుపుతో కొనసాగుతున్న సమ్మె ఐదో రోజుకు చేరుకుంది. ఈ సమ్మెలో జడ్చర్ల డివిజన్కు చెందిన ఆర్టిజన్ కార్మికులు పాల్గొన్నారు. 2016కు ముందున్న అవుట్సోర్సింగ్ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని, పీస్ రేట్ కార్మికులకు జీవో 11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామనిహెచ్చరించారు.