BDK: పాల్వంచ మండలం జగన్నాథపురం గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ఇవాళ చండీ హోమ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో రజనీకుమారి తెలిపారు. చండీ హోమంలో పాల్గొనే భక్తులు ముందుగానే రూ. 2516 చెల్లించి గోత్రనామాలను నమోదు చేసుకోవాలని అన్నారు. చండీ హోమంలో పాల్గొనే దంపతులకు శేష వస్త్రంతో పాటు ప్రసాదం అందజేయడం జరుగుతుందని తెలిపారు.