SRPT: ఆత్మకూరు (ఎస్) మండలం నెమ్మికల్ పోల్కమ్మకుంటలో రాత్రివేళ యథేచ్ఛగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారుల అండతోనే వెంచర్లకు మట్టిని తరలిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన తహసీల్దార్ అమిత్ సింగ్, అనుమతులు లేకుండా మట్టి తరలిస్తే వాహనాలను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఈరోజు హెచ్చరించారు.