SRD: నారాయణఖేడ్ పట్టణ పరిధిలోని మన్సూర్పూర్ 8వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ నాగేష్ శెట్కార్తో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా లచ్చమ్మ, పూలమ్మ, సుజాత, సక్కమ్మ వంటి లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని ఇంజనీర్ మగ్గు వేసి ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.