MDK: నిజాంపేటలో నూతన తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం పరిశీలించారు. ప్రస్తుతం కార్యాలయం శిథిలావస్థకు చేరిన పెంకుటింట్లో కొనసాగుతున్న నేపథ్యంలో, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి దానం చేసిన స్థలాన్ని ఆయన సందర్శించారు. భవన నిర్మాణానికి సంబంధించి తక్షణమే నివేదికలు సిద్ధం చేసి పంపాలని అధికారులను ఆదేశించారు.