MDK: నర్సాపూర్ పురపాలిక నూతన పాలకవర్గం తొలి సమావేశం ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అధ్యక్షతన సోమవారం ఉత్సాహంగా సాగింది. తొలుత కౌన్సిలర్లు, సిబ్బంది మధ్య పరిచయ కార్యక్రమం నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా పట్టణ ప్రగతికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు.