PDPL: ప్రతి హిందువు హిందూ ధర్మరక్షణకు నడుము బిగించాలని శ్రీశ్రీశ్రీ కొత్తకోట శివానంద స్వామి పిలుపునిచ్చారు. జూలపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం జరిగిన హిందూ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. హిందుత్వం మానవాళి హితం కోరే ధర్మమని తెలిపారు. హిందూ ధర్మాన్ని, సంస్కృతిని ఆచరించి, దేవాలయాలను శక్తివంతం చేయాలని సూచించారు.