AP: ఇవాళ రాష్ట్రంలో 2.50 లక్షల ఇళ్లలో ప్రభుత్వం గృహప్రవేశాలు నిర్వహించనుంది. లక్ష టిడ్కో ఇళ్లతో పాటు కాలనీల్లో పూర్తయిన మరో 1.50 లక్షల ఇళ్లలో నిర్వహించనున్న గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. 11.55AMకు లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయిస్తారు. అనంతరం చంద్రబాబు తిరుపతి వెళ్లనున్నారు. అక్కడ ప్రభుత్వం చేపట్టిన పీ-4 వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.