KRNL: హొలగుందలో ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆదివారం పర్యటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమై రాబోయే స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి కట్టుబడి పనిచేయాలని, ప్రజా సమస్యలపై స్పందిస్తూ విశ్వాసం పొందాలని సూచించారు. కార్యకర్తల ఐక్యతే విజయానికి కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.