NRPT: మద్దూరు మండలం ధంగాన్పూర్ గ్రామంలో మామిళ్ల నరేశ్ నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఆదివారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రభుత్వ గొప్ప నిర్ణయమని పేర్కొన్నారు. ఈ వేడుకకు మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ సరస్వతి జనార్దన్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.