NDL: ఆళ్లగడ్డ మండలంలో అధిక లోడుతో ఆటోలు ప్రమాదకరమని MVI రవిశంకర్ నాయక్ అన్నారు. ఇవాళ ఆళ్లగడ్డలో ఆటోలను తనిఖీ చేశారు. 6 మంది కంటే ఎక్కువ ప్రయాణికులతో ఆటోలు నడిపితే కేసులు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచి, డ్రైవర్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. డ్రైవర్ కచ్చితంగా యూనిఫామ్ ధరించాలని, రోడ్డు నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడపాలన్నారు.