మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ తొలి బడ్జెట్ సమావేశం తూతూ మంత్రంగా నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ విమర్శించారు. ఆదివారం మంచిర్యాలలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బడ్జెట్పై ప్రతిపక్షాలు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు బడ్జెట్లో ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని పేర్కొన్నారు.