NLR: ఏప్రిల్ 1న ముఖ్యమంత్రి చంద్రబాబు వింజమూరులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. శనివారం సీఎం పర్యటనకు సంబంధించి వింజమూరు గెస్ట్ హౌస్ నిర్వహణ, ప్రోటోకాల్ బాధ్యతలను నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్కు కలెక్టర్ అప్పగించారు.