ఏలూరు శాంతినగర్లో రోడ్లు, డ్రైన్లను పరిశీలించిన కలెక్టర్ వెట్రిసెల్వి నగరంలో అపరిశుభ్రతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, డ్రైన్లలో మురుగునీరు నిలిచిపోవడాన్ని గుర్తించి, సంబంధిత పారిశుద్ధ్య సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలో ఎక్కడా చెత్త కనిపించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.