VSP: గుజరాత్లో జరిగిన జాతీయ సదస్సులో ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థులు పలు అవార్డులు సాధించారు. ఎంఎస్సీ సైకాలజీ విద్యార్థినులు జె.మనీషా, ఎం.కారుణ్య ‘యంగ్ సైకాలజిస్ట్’ అవార్డును అందుకోగా, గౌరీ లక్ష్మి కొరిబిల్లి ‘నైనా సింగ్ మెమోరియల్’ అవార్డును గెలుచుకున్నారు. వారి పరిశోధనలకు గుర్తింపుగా ఈ పురస్కారాలు లభించాయని ఏయూ వీసీ రాజశేఖర్ అభినందించారు.