KRNL: రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎంపీ నాగరాజు అన్నారు. శనివారం కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలో ఒంగోలు జాతి ఎద్దుల బండలాగుడు పోటీలను ఆయన ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని ఎంపీ ఆరోపించారు. రైతుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.