KDP: విశ్వనాధపురం రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ శనివారం భిక్షాటన నిర్వహించారు. వెంటనే పనులు ప్రారంభించకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని కమిటీ హెచ్చరించింది. రెండేళ్లుగా పనులు నిలిచిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.