W.G: మార్టేరు బస్టాండ్ ప్రాంతంలో వీధి కుక్కల సంచారం విపరీతంగా పెరగడంతో ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లిగూడెం, భీమవరం వెళ్లే కూడళ్లలో కుక్కలు గుంపులుగా ఉండి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నాయి. బస్సులు ఎక్కే సమయంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటోందని, పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వీడి కుక్కల బెడదను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.