WNP: శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా కొత్తకోట మండల పరిధిలో శ్రీ సీతారాముల వారి పల్లకి సేవ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శనివారం మండల కేంద్రంలో సీతారాముల ప్రతిమలను పల్లకిలో ఆశీనులు చేసి ప్రధాన వీధుల్లో ఊరేగించిన పల్లకి సేవ శ్రీ రాఘవేంద్ర స్వామి కళ్యాణ మండపం సాగింది. ‘శ్రీ రామచంద్ర మూర్తికి జై’ అంటూ నినాదాలు చేశారు.