NZB: రాష్ట్రంలో గిరిజన అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ధర్పల్లిలోని శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.