Akp: జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని నర్సీపట్నం ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర పిలుపునిచ్చారు. నర్సీపట్నంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 5వ విడత సభ్యత్వ నమోదు ప్రారంభమవుతుందని తెలిపారు. ఉద్యమి, సాధక్, ప్రధాతగా మూడు వర్గాలుగా సభ్యత్వాన్ని విభజించినట్లు పేర్కొన్నారు. కరపత్రాలను విడుదల చేశారు.