MBNR: భూత్పూరు మండలంలోని మొల్గర, పోతులమడుగు గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. బుధవారం ఆయా గ్రామాల్లోని రామాలయాల్లో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి సతీసమేతంగా పాల్గొని, స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు .కల్యాణ తంతును వీక్షించేందుకు గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.