SRCL: వేములవాడలోని భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శుక్రవారం పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.