MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న రామాలయాలు, హనుమాన్ దేవాలయాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని జన్నారంలోని రామాలయం, మందపల్లిలోని సీతారామ స్వామి వారి దేవాలయం, హనుమాన్ దేవాలయాల్లోని స్వామివార్లకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఆయా దేవాలయాలకు వెళ్లి స్వామి, అమ్మవార్లకు పూజలు చేస్తున్నారు.