TG: భద్రాద్రి రామునికి రామదాసు చేయించిన ఆభరణాలనే నేటికీ ధరింపజేస్తారు. కళ్యాణం రోజున రాముల వారు ధరించే రవ్వల వైరముడి, మధ్యలో గల నీలపురాయి మద్రాసుకు చెందిన వేశ్య.. శ్రీరామునికి సమర్పించిందని కథనం. సీతారాముల అలంకరణకు సయ్యద్ మీరా అనే ముస్లిం భక్తుడు బంగారు తోడాలు ఇచ్చారు. భక్తరామదాసు 30 తులాలతో చేయించిన మూడు బంగారు మంగళ సూత్రాలతోనే సీతమ్మ వారికి సూత్రధారణ జరుగుతుంది.