కడప: నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఈవీఎం గోడౌన్లను గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో కలిసి గురువారం పరిశీలించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీలలో భాగంగా తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. జిల్లా ఇంఛార్జ్ రెవెన్యూ అధికారి వెంకటపతి, శ్రీకాంత్ రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.