NLR: టీడీపీ సీనియర్ నేత కొండూరు సుధాకర్ రెడ్డి గురువారం రాత్రి చెన్నైలో మృతి చెందారు. ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామానికి చెందిన ఆయన అస్వస్థతతో చెన్నైలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయన గంగపట్నం ఆలయ ఛైర్మన్గా పనిచేశారు. ఆయన మృతి పట్ల కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సంతాపం తెలిపారు. శుక్రవారం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు చెప్పారు.