W.G: యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్ కొరత తీవ్రంగా ఏర్పడింది. దీంతో ఆకివీడు ప్రజలు కర్రీ పాయింట్ల బాటపట్టారు. వండుకునే భారం తగ్గుతుందని వినియోగదారులు భావిస్తుండటంతో కర్రీ పాయింట్లకు క్యూ కడుతున్నారు. గ్యాస్ ధరల ప్రభావంతో నిర్వాహకులు సైతం కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు. వెజ్ కర్రీపై రూ. 10, నాన్ వెజ్పై రూ. 20 వరకు ధరలు పెంచారు.