VZM: మెరకముడుదాం మండలం గర్భాంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఏఎంసీ ఛైర్మన్ తాటి చంద్రశేఖర్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మాలిక్ నాయుడు వచ్చారు. చుట్టుపక్కల గ్రామాల రైతులు తమ పశువులను తీసుకొచ్చారు.