ATP: గుత్తి పట్టణ శివారులో గురువారం ఓ గుర్తు తెలియని యువకుడు రైలు కిందపడి మృతి చెందాడు. నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలు కిందకు వెళ్లి ప్రాణాలు తీసుకున్నట్లు జీఆర్పీ కానిస్టేబుల్ నాగరాజు తెలిపారు. మృతుడి వివరాలు మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై GRP పోలీసులు దర్యాప్తు చేపట్టారు.