గుంటూరు: పల్నాడు జిల్లాలకు చెందిన ముగ్గురు స్నేహితులకు హన్మకొండ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆల్ప్రాజోలం మాత్రలతో డ్రగ్ పొడి తయారు చేసి న్యూఇయర్ వేడుకల్లో విక్రయానికి 2023లో హైదరాబాద్ వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో నేరం రుజువై వారికి శిక్ష పడినట్లు పోలీసులు వెల్లడించారు.