SKLM: పూండి గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ఈశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఎమ్మెల్యే గౌతు శిరీషను ఆమె కార్యాలయంలో బుధవారం సాయంత్రం కలిశారు. ఈ మేరకు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పూండి రైల్వే స్టేషన్లో పలు రైళ్లకు హాల్ట్ కల్పించాలన్నారు.