SKLM: కోటబొమ్మాళిలో ఇవాళ జరగనున్న సన్నాహక సమావేశానికి నేతలు, కార్యకర్తలు హాజరుకావాలని వైసీపీ మండలాధ్యక్షుడు సంపతిరావు రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ హాజరుకానున్నారు. మన మూలపేట పోర్టుకు పోదాం కార్యక్రమం నేపథ్యంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.