KRNL: గ్రూప్-2 నియమాకాల ద్వారా ఎంపికైన ట్రైనీ ప్రొహిబిషన్, ఎక్సైజ్ సబ్ఇన్స్పెక్టర్ ఎస్. ధనుంజయ బుధవారం కోసిగి ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించి శిక్షణ ప్రారంభించారు. పెద్దకడబూరు గ్రామానికి చెందిన ఆయనను ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి. భార్గవ రెడ్డి అభినందించారు. శిక్షణ కాలాన్ని సద్వినియోగం చేసుకుని శాఖ విధులు నేర్చుకోవాలని సూచించారు.